ఈ నెల 11న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనకు వస్తున్నారని, గరుడ సేవ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.తిరుమల పర్యటన సందర్భంగా సీఎం జగన్ బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో సిద్ధం చేసిన శ్రీపద్మావతి చైల్డ్రన్స్ హార్ట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తారని తెలిపారు. దాంతో పాటు అలిపిరి వద్ద 15 కోట్లతో నిర్మించిన గోమందిరం ప్రారంభిసారని తెలిపారు. మరుసటి రోజు ఉదయం సీఎం జగన్ తిరుమలలో ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానెల్స్ని ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పాల్గొంటారని చెప్పారు.