Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు

: ధర్మాన కృష్ణ దాస్‌
రాష్ట్ర రైతాంగానికి మంచి చేయాలని ఉద్దేశ్యంతో చేపట్టిన జలయజ్ఞాన్ని నిర్వీర్యం చేసిన పాపం చంద్రబాబుదే అని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతూ ఇతర పార్టీలతో పొత్తుల వ్యవహారం నడుపుతున్నారని, ఇంతకు మించి సిగ్గుచేటు పని ఇంకోటి లేదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలు పట్టించుకోని టీడీపీ.. నేడు రైతుల సమస్యలపై ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.బద్వేలు ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇస్తే, టీడీపీ మాత్రం రహస్య మద్ధతు ఇచ్చి భంగపడిరదన్నారు. టీడీపీని కాపాడుకునేందుకు జనసేన, బీజేపీల సహాయాన్ని చంద్రబాబు అర్థిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా.. రాష్ట్రంలో టీడీపీ కోలుకోవడం సాధ్యం కాదన్నారు. ప్రజలకు జవాబు దారీగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమ దిశగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img