అమరావతి రైతుల పాదయాత్ర దృష్ట్యా గుడివాడలో పోలీసులు ఆంక్షలు విధించారు. 600 మంది రైతులతో పాదయాత్రకు హైకోర్టు అనుమతించిందని ఎస్పీ జాషువా తెలిపారు. హైకోర్టు ఆదేశాలను అందరూ పాటించాలని, గుడివాడలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జాషువా హెచ్చరించారు. రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది.