Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇప్పుడు రండి.. దమ్ముంటే జగన్‌, డీజీపీ కూడా రండి: చంద్రబాబు సవాల్‌

చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత
కుప్పం చరిత్రలో ఇది చీకటి రోజు అని వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటనకు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగిస్తూ…. దమ్ముంటే, మగాళ్లైతే ఇప్పుడు రావాలని సవాల్‌ విసిరారు. జగన్‌కు దమ్ముంటే తన సవాల్‌ స్వీకరించాలని అన్నారు. దమ్ముంటే సీఎం జగన్‌, డీజీపీ వచ్చినా సరే అని ఛాలెంజ్‌ చేశారు. జగన్‌ రెడ్డి చేతిలో పోలీసులు కీలు బొమ్మగా మారారని మండిపడ్డారు. కుప్పం చరిత్రలో ఇదొక చీకటి రోజని అన్నారు. ఇలాంటి దారుణాలు కుప్పంలో గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. గూండాలు, రౌడీలను అణచి వేసిన చరిత్ర టీడీపీదని చంద్రబాబు అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను గాడిలో పెడతానని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వీధికొక రౌడీని తయారు చేసిందని అన్నారు. రౌడీలను మంత్రులను చేసిన ఘనత జగన్‌ దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై టీడీపీ వాళ్లను ఎవరైనా కొడితే నేరుగా వాళ్లింటికి వస్తానని హెచ్చరించారు. ఇంటికొచ్చి కొడతానని హెచ్చరించారు. తాను బతికున్నంత వరకు ఏమీ చేయలేరని చెప్పారు. ధర్మపోరాటాన్ని తాను కుప్పం నుంచే ప్రారంభిస్తున్నానని చెప్పారు. జగన్‌ పాలనపై రాష్ట వ్యాప్తంగా వ్యతిరేకత, తిరుగుబాటు మొదలయిందని అన్నారు. అంతకు ముందు కుప్పంలో అన్న క్యాంటీన్‌ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేయాలని వీరికి ఎలా అనిపించిందని మండిపడ్డారు. వీరు అన్నం పెట్టరు, పెట్టేవాళ్లను పెట్టనివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img