Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎంపీలకు వారి బాధ్యతను గుర్తు చేయాలనే డిజిటల్‌ క్యాంపెయిన్‌

పవన్‌కల్యాణ్‌
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 18,19,20 తేదీల్లో డిజిటల్‌ క్యాంపెయిన్‌ చేపట్టనున్నట్లు వెల్లడిరచారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి కూడా విశాఖ ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా పెదవి విప్పలేకపోతున్నారని, పైగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారికి వారి బాధ్యతను గుర్తు చేయాలనే ఈ డిజిటల్‌ క్యాంపెయిన్‌ను సాగిద్దామని అన్నారు. వైసీపీ. టీడీపీ ఎంపీలు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లోనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ గురించి మాట్లాడాలని డిమాండు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని పార్లమెంటులో గట్టిగా వినిపించాలని కోరుతూ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను సామాజిక మాధ్యమాల ద్వారా కోరుదామని అన్నారు. 18 వతేదీ ఉదయం పది గంటలకు సామాజిక మాధ్యమాల ద్వారా ఎంపీలను ట్యాగ్‌ చేసే డిజిటల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img