ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదాని గ్రూప్ చేపట్టనున్న 3,700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఎస్ఐపీబీ సమావేశం ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు కోసం అదాని గ్రూప్ రూ.15,376 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇదివరకే అదాని గ్రూప్ ఏపీ ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెట్టగా… దానిపై కూలంకషంగా పరిశీలన జరిపిన ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో త్వరలోనే అదాని గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.