Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలో ఒక్కరోజే 10 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు.. 8 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. 24గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటలల్లో కొత్తగా 10,057 కరోనా కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. నిన్న ఒక్కరోజు 41 వేల 713 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడిరచింది. కాగా ప్రస్తుతం ఏపీలో ప్రస్తుతం 44,935 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలిపింది. ఇక, కరోనా కారణంగా నిన్న విశాఖలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందినట్లు బులెటిన్‌ లో తెలిపింది. ఇక, ఇప్పటివరకు వైరస్‌ కారణంగా 14,522 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,222 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 3,19,64,682 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img