ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 21,360 నమూనాలు పరీక్షించగా, 117 కేసులు నమోదయ్యాయని ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులిటిన్లో తెలిపింది. కరోనా బారినపడి ఒకరు మృతిచెందారు. కరోనా నుంచి నిన్న 241 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 2,961 యాక్టివ్ కేసులు ఉన్నాయి.