Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలో కొత్తగా 1,248 పాజిటివ్‌ కేసులు


ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 58,890 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,248 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15 మంది కరోనాతో మృతి చెందారు. తాజాగా చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, కర్నూలు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మొత్తం 15 మంది మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 13677 ఉండగా, గడిచిన 24 గంటల్లో 1715 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13750 మృతి చెందారు. ఇక మొత్తం రికవరీ కేసులు 19.77 లక్షల మంది ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img