ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా విధించిన రాత్రి పూట కర్ఫ్యూని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.అర్ధరాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సెప్టెంబర్ 4 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని ఉత్తర్వులలో పేర్కొంది. కర్ఫ్యూ సమయాల్లో నిబంధనలు పాటించని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు.