రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ గుజరాత్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిరది. ద్రోణి పోర్బందర్, సూరత్, జలగావ్, రామగుండం, మచిలీపట్నం మీదుగా ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.