వరి పొలానికి పురుగుల మందు పిచికారీ చేసేందుకు వెళ్లిన ముగ్గురు రైతులు కరెంట్ షాక్తో మృత్యువాతపడ్డారు. వీరిలో ఒకరు యువకుడు ఉన్నారు. కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి (65), పెద్దిరెడ్డి బాల ఓబుల్ రెడ్డి (60) బుమ్ము మల్లికార్జునరెడ్డి (23) శుక్రవారం (అక్టోబర్ 28) ఉదయం వరి పొలంలో పురుగుల మందు పిచికారి చేసేందుకు ఇంటి నుంచి బయల్దేరి వెళ్లారు. పురుగుల మందు స్ప్రే చేస్తుండగా.. కరెంటు స్తంభం నుంచి కిందికి వేలాడిన ఓ విద్యుత్ వైరు తగిలినది. ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు ముగ్గురు రైతులు ఈ ఘటనలో మృత్యువాతపడ్డారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఓబుల్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి అన్నదమ్ములు కాగా.. మల్లికార్జున్ రెడ్డి వీరి సమీప బంధువు.