Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కర్నూలులో ఏసీబీ అధికారుల తనిఖీలు

కర్నూలు సిటీలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కో ఆపరేటివ్ శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో కర్నూలు కో ఆపరేటివ్ శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న సుజాత ఇంట్లో ఈరోజు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణనగర్ లోని కో ఆపరేటివ్ బ్రాంచ్ నందు డిప్యుటీ రిజిస్ట్రార్ సుజాత విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలు సిటీలోని శ్రీరామ నగర్ నాగులకట్ట సమీపంలోని ఆమె ఇంట్లో ఉదయం 11 గంటల నుండి సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img