కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ
బహ్రెయిన్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కార్మికులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. బహ్రెయిన్లో ఓ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం చేతిలో చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిలో చాలా మంది ఏపీకి చెందిన వారు ఉన్నారన్నారని లేఖలో పేర్కొన్నారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు.