Friday, April 26, 2024
Friday, April 26, 2024

కేసులు పెడితే భయపడిపోతానా?: అంబటి రాంబాబు

ఫేక్‌ ట్వీట్ల వ్యవహారంలో అంబటిపై సీఐడీకి ఫిర్యాదు చేసిన దేవినేని ఉమ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత దేవినేని ఉమ తనపై కేసులు పెడితే భయపడిపోయే రకం కానని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎవరిపై ఎవరైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, ఆ స్వేచ్ఛ వారికి ఉందని అన్నారు. చట్టం మాత్రం దాని పని అది చేసుకుంటుందని పేర్కొన్నారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు, పశ్చిమ డెల్టాకు శుక్రవారం మంత్రి నీరు విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫేక్‌ ట్వీట్‌ను తనకు ట్యాగ్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్నారంటూ అంబటిపై దేవినేని ఉమ సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన ట్విట్టర్‌ ఖాతాను మార్ఫింగ్‌ చేసి తప్పుడు ప్రచారం చేశారని ఆ ఫిర్యాదులో ఉమ ఆరోపించారు. ఉమ ఫిర్యాదుపై స్పందించిన అంబటి.. కావాలంటే చంద్రబాబు, ఉమ తనపై అంతర్జాతీయ న్యాయస్థానానికీ వెళ్లొచ్చంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img