Friday, April 26, 2024
Friday, April 26, 2024

కోనసీమ జిల్లాలో లంపీ స్కిన్‌ కలకలం..వైరస్‌ బారిన పడుతున్న మూగ జీవాలు

వణికిపోతున్న రైతులు
కోనసీమ జిల్లా రైతాంగాన్ని లంపీ స్కిన్‌ వ్యాధి వణికిస్తోంది. ఇక్కడి పశువులు చర్మ వ్యాధి బారిన పడుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లంపీ స్కిన్‌ అనేది ఆవులు, ఎద్దుల్లాంటి జంతువులకు సోకుతుంది. ఇది రక్తాన్ని పీల్చే దోమలు, ఇతర కీటకాల ద్వారా ఒక జంతువు నుంచి మరో జంతువుకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులకు జ్వరం రావడంతో.. చర్మంపై గడ్డల్లా వస్తాయి. ఈ వ్యాధి బారిన పడిన పశువులు మరణించే ప్రమాదం ఉంది.గతంలో తెలుగు రాష్ట్రాల్లో పశువులు లంపీ స్కిన్‌ వైరస్‌ బారిన పడ్డాయి. ఈ ఏడాది రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ తదితర జిల్లాల్లో లంపీ స్కిన్‌ డిసీజ్‌ను గుర్తించారు. ఈ జబ్బు బారిన పడిన తొలి నాళ్లలో పశువుకు జ్వరం సోకుతుంది. ఆ తర్వాత కళ్లు, ముక్కు నుంచి నీరు కారుతుందని ఆయన చెప్పారు. చర్మంపై గుండ్రటి గడ్డల ఏర్పడతాయని.. తర్వాతి దశలో కాళ్ల నొప్పుల కారణంగా పశువు సరిగా నడవలేదన్నారు. ఫ్లోరైడ్‌ బారిన పడిన వారిలో ఎలాగైతే కాళ్లు వంగుతాయో.. లంప్‌ స్కిన్‌ బారిన పడిన పశువుల్లోనూ కాళ్లు అలాగే వంగుతాయన్నారు.లంప్‌ స్కిన్‌ వ్యాధి బారిన పడిన ఆవులకు సంప్రదాయ దినుసులతో చేసిన మందును తినిపించడం ద్వారా అవి కోలుకుంటున్నాయి. గాయంపై మందు రాసే విధానం ద్వారా కూడా చికిత్స అందించొచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img