Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

గుంటూరు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య (36) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే, మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. పని నిమిత్తం గురువారం ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై చంద్రయ్య బయలుదేరి వెళ్లగా అప్పటికే అతని కోసం వేచి చూస్తున్న ప్రత్యర్థులు పథకం ప్రకారం బైక్‌కు కర్ర అడ్డుపెట్టి కిందపడేలా చేశారు. అనంతరం అతనిపై కత్తులు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. హత్య అనంతరం ప్రత్యర్థులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా గస్తీ ఏర్పాటు చేశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేవలం రెండు కి.మీ.లదూరంలో ఉన్న ప్రాంతానికి హత్య జరిగిన 2 గంటల తర్వాత పోలీసులు రావడంపై చంద్రయ్య కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవాళ మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రయ్య స్వగ్రామం గుండ్లపాడుకు రానున్నారు. చంద్రయ్యకు నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img