ఎగువ ప్రాంతాల నుండి వచ్చి పడుతున్న వరద నీటి ప్రవాహంతో బుధవారం యలమంచిలిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో నిన్నటి వరకు కనకాయలంక కాజ్వే పై ప్రవహించిన వరద నీరు గ్రామంలోకి చేరింది. రాత్రికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో లంక గ్రామాలైన పెద్దలంక, బాడవ, యలమంచిలి లంక, లక్ష్మీపాలెం ,అబ్బిరాజుపాలెం, గంగడుపాలెం, దొడ్డిపట్ల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు పర్యాయాలు వరదలలు భవించడంతో ఏ విధమైన ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని..మరలా ఇప్పుడు నాలుగవసారి వరద వచ్చిందని వాపోతున్నారు.