Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జగనన్న ఆసరా కాదు..జగనన్న దోపిడీ…

టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత
డ్వాక్రా గ్రూపులను వైసీపీ ప్రభుత్వం నిర్విర్యం చేస్తోందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మహిళా డబ్బులతో కూడా జగన్‌ వ్యాపారం చేస్తున్నారని, మహిళలు దాచుకున్న డబ్బును వాడుకోవడానికి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందని ప్రశ్నించారు.జగనన్న ఆసరా కాదు..జగనన్న దోపిడీ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. 98 లక్షల డ్వాక్రా మహిళలు రాష్ట్రంలో ఉంటే..72 లక్షల మందికి అసరా పథకం ఇస్తున్నారని తెలిపారు. 45 ఏళ్ల మహిళలకు పెన్షన్‌ ఇస్తానని చెప్పిన మాటలు ఏమైపోయాయని ప్రశ్నించారు. అన్నిటి ధరలను పెంచి ప్రభుత్వం ఒక చేత్తో ఇస్తూ..మరో చేత్తో దోపిడి చేస్తున్నారని దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img