డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పదవులపై సీఎం జగన్ నిర్ణయం శిరోధార్యమన్నారు. తమకు పదవులు ఉన్నా లేకున్నా వైఎస్ జగన్తోనే ఉంటామని స్పష్టంచేశారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం జగన్ సీఎంగా ఉంటారని అన్ని అనుకూలిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 15 సంవత్సరాల తర్వాత సీఎం జగన్ ప్రధాని అవుతారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.అన్నారు. తాము ఎల్లప్పుడు ఆయనకు తోడు నీడగా ఉంటూ.. అడుగులో అడుగు వేసి ముందుకు వెళతామన్నారు.