కృష్ణాజిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల్లో జరిగిన స్కాంను జిల్లా పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు స్టాంప్ వెండర్ రామ్ ధీరజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.కౖకలూరు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిరచారు. నిందితుడి నుంచి రూ.1.02 కోట్లు నగదు రీవకరీ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి నూరు శాతం నగదు రికవరీకి చర్యలు చేపట్టామన్నారు. బాధితులు ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో అతిపెద్ద నకిలీచలానాల భాగోతం కృష్ణాజిల్లా మండపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరిగింది. సుమారు మూడున్నర కోట్ల రూపాయల నకిలీ చలానాల స్కామ్ మండవల్లిలో చోటుచేసుకుంది.