Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లిన చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు

ఏపీలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. బ్యానర్‌ పట్టుకుని పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లారు. . ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలని, చెత్తపై పన్ను వంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలంని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్నాయన్నారు. జగన్‌ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో సామాన్యులు చితికిపోతున్నారని అన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. విద్యుత్‌ చార్జీలు కూడా ఏపీలో ఎక్కువే అని ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img