ఎగువ నుంచి కృష్ణా నదిలోకి వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్యారేజీ గేట్లను ఎత్తేశారు. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 4.44లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదికి ఇరువైపులా పోలీసు పికెటింగ్ ఏర్పాట్లు చేశారు. స్నానఘట్ల వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు. మరోవైపు విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలైన కఅష్ణలంక, భూపేష్ గుప్తా కాలనీ, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.