ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
ఫైబర్ గ్రిడ్ కేసును సీఐడీ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సీఎం జగన్కు తెలిపారు. ఈ కేసు విషయమై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. అప్పట్లో తాను పారిశ్రామికవేత్తనే కానీ వైస్సార్సీపీలో లేనని, సీఎం జగన్ అత్యంత పారదర్శకతతో టెండర్లు నిర్వహిస్తున్నారు. కానీ ఆనాడు ఆ పారదర్శకత లేదని పేర్కొన్నారు. ఆరోజున ఈ ఫైబర్ గ్రిడ్ టెండర్ వేసి అర్హతలన్నీ ఉన్నా తమకు ఇవ్వలేదని, ఏ అర్హత లేని ఆ కంపెనీకి ఇచ్చారు అని తెలిపారు. అప్పట్లో ప్రభుత్వానికి దీనిపై ఫిర్యాదు కూడా చేసినట్లు చెప్పారు.