Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

బీజేపీ ప్రతీ చర్యకు రియాక్షన్‌ ఉంటుంది : శైలజానాథ్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రం మంత్రి అమిత్‌ షాల వికృత రాజకీయ క్రీడను దేశమంతా వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షులు శైలజానాథ్‌ అన్నారు. బీజేపీ చేసే ప్రతీ చర్యకూ రియాక్షన్‌ ఉంటుందన్నారు. దేశంలో సమస్యలను డైవర్షన్‌ చేయడానికే రాహుల్‌ గాంధీని విచారించారని ఆరోపించారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ రాహుల్‌ పర్యటిస్తారని తెలిపారు. ఆశేతు హిమాచలం రాహుల్‌ పర్యటిస్తే బీజేపీ పక్కటెముకలు విరుగుతాయని వ్యాఖ్యానించారు. తక్షణమే రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img