మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి
బద్వేల్ నియోజకవర్గం ఉప ఎన్నిక తమకు నల్లేరు మీద నడక అని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైందని తెలిపారు. ‘దివంగత వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను సీఎం జగన్ అభ్యర్థిగా ప్రకటించారు. భారీ మెజారిటీతో డాక్టర్ సుధ గెలుస్తారు. దాని కోసం మేమంతా కృషి చేస్తాం.’ అన్నారు. ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ టీడీపీ ఆలోచన ఏవిధంగా ఉందో తెలియదని అన్నారు.