మూడు ప్రాంతాల అభివృద్ధి తమ విధానమని, దానికి కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. . తిరుపతిలో రైతుల పేరిట రేపు జరగబోయేది రాజకీయ సభ అన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా దోచుకోవడమే టీడీపీ లక్ష్యమన్నారు. అమరావతే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పారు.పాదయాత్రలో పాల్గొన్నది టీడీపీ వాళ్లేనన్నారు. ప్రాంతీయ అసమానతలు ఉండొద్దనే మూడు రాజధానులను చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ ఏర్పాటు చేయాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.