Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది : నారా లోకేష్‌

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ రాష్ట్రంపై పడి ప్రజాధనం దోచుకుంటుంటే..వైసీపీ నేతలు గ్రామాలపై పడుతున్నారని మండిపడ్డారు. హిందూ దేవాలయాలపై వైసీపీ ముఠాలే దాడులు చేసి.. టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లాకు చెందిన చోటా వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో రూ.25కోట్ల విలువైన మరకత విగ్రహం బయటపడిరదన్నారు. వైసీపీ బడా నేతల ఇళ్లల్లో ఇంకెన్ని పురాతన విగ్రహాలున్నాయో? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ వైసీపీ నేతలు.. నగలు, విగ్రహాలు ఎత్తుకెళ్లారని భక్తుల్లో అనుమానాలున్నాయని లోకేష్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img