Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై ఏపీలో రాళ్ల దాడి

గూడూరు సమీపంలో ఘటన
పగిలిన బోగీ అద్దం
రేణిగుంట రైల్వే పోలీసులకు ఫిర్యాదు

దేశంలోనే అత్యంత వేగగామి ట్రైన్ గా పేరుగాంచిన వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుపై ఏపీలో రాళ్ల దాడి జరిగింది. నిన్న గూడూరు సమీపంలో ఈ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు వేగంగా వెళుతున్న రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రైలు బోగీ అద్దం పగిలినట్టు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు కూడా పలుమార్లు రాళ్ల దాడికి గురైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img