వైఎస్ఆర్ జిల్లా కడప – ఇడుపులపాయ : వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. ప్లీనరీ వేదికపై దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ నివాళులర్పించారు. ప్లీనరీ సమావేశాలకు వైఎస్ విజయమ్మ హాజరయ్యారు.వైఎస్ఆర్ ఘాట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు,ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైయస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు హాజరై దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్కు ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రితో పాటు.. వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నవారిలో జిల్లా ఇంఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల విజయలక్ష్మి, ఎపిఎస్ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పులి సునీల్, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల రaన్షి రాణి, పద్మశాలీ కార్పొరేషన్ చైర్ పర్సన్ జింకా విజయలక్ష్మి, హ్యాండి క్రాఫ్ట్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, అడా చైర్మన్ గురుమోహన్, సగర కార్పొరేషన్ చైర్ పర్సన్ జి.రమణమ్మ, వేర్ హౌస్ కార్పొరేషన్ ఛైర్మన్ కరీముల్లా తదితరులు ఉన్నారు.