ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఓ పంక్షన్లో పాల్గొనేందుకు ఆమె కర్నూలు వచ్చారు.కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో గుత్తిరోడ్డులో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. అయితే, విజయమ్మ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారు.ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం అక్కడి నుంచి మరో కారులో ఆమె బయల్దేరి వెళ్లారు.