ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కన్నబాబు శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.43052.78 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోందన్న మంత్రి కన్నబాబు.. రాయితీలతో పాటు నాణ్యత అందించే విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్తున్నట్లు వెల్లడిరచారు.
వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు
మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు, మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ.614.23 కోట్లు
సహకార శాఖకు రూ.248.45 కోట్లు
ఆహార శుద్ధి విభాగానికి రూ.146.41 కోట్లు
ఉద్యనశాఖకు రూ.554 కోట్లు
పట్టు పరిశ్రమకు రూ.98.99 కోట్లు
ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.421.15 కోట్లు
వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.59.91 కోట్లు
వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.122.50 కోట్లు
పశు సంవర్ధక శాఖకు రూ.1027.82 కోట్లు
మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ.337.23 కోట్లు
వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ.5000 కోట్లు
వైఎస్సార్ జలకళకు రూ.50 కోట్లు
నీటి పారుదల రంగానికి రూ.11450.94 కోట్ల ప్రతిపాదన