Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

సీపీఎస్‌ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటాం : మంత్రి బొత్స

సీపీఎస్‌ రద్దు కోరుతూ ఇవాళ ‘చలో సీఎంవో’ ముట్టడికి యూటీఎఫ్‌ పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున అరెస్టులు, నిరసనలతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్సి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ…ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.ఉపాధ్యాయులు తొందరపడి సీఎంవో ముట్టడికి వెళ్లే ప్రయత్నాలు చేస్తుండడం ఏంటని నిలదీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని బొత్స సత్యనారాయణ చెప్పారు. సమస్యల పరిష్కారానికి కమిటీ వేశామని, ఆ కమిటీయే అన్ని అంశాలను పరిశీలిస్తుందని అన్నారు. ఇదే విషయంపై మళ్లీ ఓ సమావేశం కూడా జరగనుందని స్పష్టం చేశారు.ఉపాధ్యాయుల సెలవుపై టీడీపీ, బీజేపీ అనవసర రాదాంతం ఎందుకు చేస్తున్నాయని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img