Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

2024లో అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే : అచ్చెన్నాయుడు

2024లో ఏపీలో అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమే అని, వైసీపీ రౌడీ మూకలకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త కనిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించబోమని చెప్పారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు అరాచకాలు పెరిగిపోతున్నాయని అన్నారు. వైసీపీ నేతల ఆలోచన అంతా దాడులు, ప్రాణాలు తీయడంపైనే ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు అరాచకాలకు తెగబడుతూ ప్రజలను భయపెడుతున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img