అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టునున్న రెండో విడత మహాపాదయాత్రకు అమరావతి రైతులు ఇవాళ శ్రీకారం చుట్టారు. అమరావతి ప్రాంతాన్నే రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్తో రైతులు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే, ఇవాళ ఉదయం పాదయాత్ర ప్రారంభమయ్యే సమయానికి ముందు మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఎవ్వరిని ప్రస్తావించకుండా జస్ట్.. అదీ మహా ఫేక్ యాత్ర అంటూ పోస్ట్ చేశారు. ఇవాల్టి నుంచి అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ట్వీట్ చేయడంతో.. ఆ మహాపాదయాత్ర గురించే ఆయన ట్వీట్ చేశారని నెటిజన్లు ఆయన ట్వీట్కి రిప్లయ్లు ఇస్తున్నారు. మరి జగన్ చేసిన పాదయాత్రను ఏమంటారు అంబటి అంటూ కౌంటర్ అటాక్ ఇస్తున్నారు.