భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్
విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో రెండో వన్డే
భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించి.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఆఫ్లైన్లో టికెట్ల అమ్మకాన్ని ప్రారంభించారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, మధురవాడ లోని క్రికెట్ స్టేడియం, గాజువాక లోని రాజీవ్ గాంధీ క్రీడాప్రాంగణాల వద్ద టికెట్ల అమ్మకం కొనసాగుతోంది. Iఅసఱa ఙం Aబర్తీaశ్రీఱa ఎa్షష్ట్ర టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఈ మూడు ప్రదేశాల్లోనూ బారులు తీరారు. టికెట్ ధరలు రూ.600, రూ.1,500, రూ. 2000, రూ. 3000, రూ.3,500, రూ. 6000గా నిర్ణయించారు. ఆన్లైన్లో టికెట్లకు వచ్చిన డిమాండ్ చూస్తే.. ఆఫ్లైన్ కోసం కూడా భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దీంతో కౌంటర్ల వద్ద తోపులాట, తొక్కిసలాట జరగకండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఆఫ్ లైన్ టికెట్ల కోసం.. అభిమానులు భారీగా తరలివచ్చారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే టికెట్ల కోసం క్యూలో నిల్చున్నారు.