Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఇంకో 6 నెలల్లో ముక్కలు కాబోతుంది : విజయసాయిరెడ్డి

తెలుగుదేశం పార్టీ ఇంకో 6 నెలల్లో ముక్కలు కాబోతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్‌ కోరుకునే నేతలు ఇతర పార్టీల్లోకి వలస పోతారన్నారు. బాబు మంత్ర దండం ‘తంత్ర’ శక్తిని కోల్పోయింది. వ్యవస్థల్లో స్లీపర్‌ సెల్స్‌ పవర్‌ సన్నగిల్లింది. ప్రజల్లో ఆదరణ లేదు. ఎలక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యం లేదని క్యాడర్‌ కు అర్థమైందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. అలాగే మరో ట్వీట్‌ లో తండ్రిని మించిపోయాడు పప్పేశ్‌. మెదడులో చిప్‌ లేకున్నా ఊహాశక్తికి పదును పెట్టి కమ్మని కథలు వినిపిస్తున్నాడన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లండి బాబూ. ఓడినా ఎప్పుడైనా వెళ్తే గుర్తుపట్టి పలకరిస్తారన్నారు. టీవీ ఛానెళ్లను మేపి జనానికి దూరం కాకండి. పొగడ్తల మాయలో పడ్డోడు రాజకీయంగా ఫినిష్‌ అయినట్టే అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img