Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఈ నెలాఖరులోపు తుది నోటిఫికేషన్‌ ఇస్తాం

ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయసేకరణ గడువు గురువారంతో ముగియనున్నట్లు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇప్పటి వరకు 7,500 సలహాలు కలెక్టర్లకు అందజేశారు. ఒక్క విజయనగరం జిల్లా నుంచే 4,500 సలహాలు, సూచనలు వచ్చాయని తెలిపారు.తర్వాత అధికంగా కృష్ణా జిల్లా నుంచి సూచనలు అందాయని తెలిపారు. అన్నిజిల్లాల సమీక్షలు ఈ రోజుతో ముగిసినట్లు తెలిపారు. వీటన్నిటిని పరిశీలించి, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద తుది నిర్ణయం జరుగుతుంది. మార్చి నెలాఖరులోపు తుది నోటిఫికేషన్‌ ఇస్తాం. కొత్త జిల్లాలకు అధికారులు, ఉద్యోగుల విభజన పూర్తి చేస్తాం. మొత్తం 60 అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చాయని అని విజయ్‌ కుమార్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img