మంత్రి ధర్మాన కృష్ణదాస్
ఈసారి జగన్ సీఎం కాకపోతే తమ కుటుంబం మొత్తం రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటుందని ఏపీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలో పర్యటించిన ఆయన ప్రతిపక్ష టీడీపీపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా పోయిందని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ధర్మాన సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలు గెలుస్తామని అచ్చెన్నాయుడు చెబుతున్నారని, ఈలోపు తాము గాజులు తొడుక్కొని కూర్చొంటామా? అని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు మాటలకు భయపడాల్సిన పనిలేదని..మళ్లీ జగనే సీఎం అవుతారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని కృష్ణదాస్ అన్నారు.