Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఎంపీ రఘురామపై పరువునష్టం దావా వేస్తాం: రజత్‌ భార్గవ

ఎంపీ రఘురామ కృష్ణరాజుపై పరువు నష్టం దావా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ ఎక్సైజ్‌ శాఖ కార్యదర్శి రజత్‌ భార్గవ తెలిపారు. రఘురామకృష్ణరాజు ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీ రఘురామ చేయించిన మద్యం శాంపిల్స్‌పై ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ ఇచ్చింది. పరీక్షలు చేసిన ఎస్‌జీఎస్‌ ల్యాబ్‌ ఇచ్చిన సమాధానం లేఖను రజత్‌ భార్గవ మీడియాకు విడుదల చేశారు. ల్యాబ్‌కు పంపించిన శాంపిల్స్‌ ఏపీ నుంచి సేకరించినవే అనటానికి ఆధారాలు లేవని తెలిపారు. పరీక్ష చేయటానికి ఎక్సైజ్‌ చట్టం ప్రకారం అనుసరించాల్సిన ఏ నిబంధనను అనుసరించలేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img