ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,442 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు మొత్తం 19,73,996 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో గత 24 గంటల్లో 16 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,444కు చేరింది. గత 24 గంటల్లో 2,412 రికవరీ అవ్వగా, ఇప్పటివరకు 19,49,368 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.