ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి గురువారం విచారణ జరిగింది. కాగా గతంలో పిటిషనర్లకు మాత్రమే ఈ జీవో నుంచి మినహాయింపు వస్తుందని ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నంబర్35 పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా టికెట్ ధరల నియంత్రణ పై జీఓ నంబర్ 35 రద్దు అన్నీ థియేటర్లకు వర్తిస్తుందని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ధరల నియంత్రణపై కొత్త కమిటీ ఏర్పాటు, వివరాలు తెలియజేయడానికి ప్రభుత్వం హైకోర్టుని సమయం కోరింది. ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది.