వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్
విశాఖలోని ఆంధ్ర యూనివర్శిటీలో అమెరికన్ కార్నర్ను వర్చువల్ విధానంలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్మెన్ తోపాటు, యూఎస్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు కావటం సంతోషకరమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేస్తుందని తెలిపారు. అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత విశాఖలో అమెరికన్ కార్నర్ ప్రారంభమైందని తెలిపారు.అమెరిన్ కాన్సులేట్ సహకారంతో విశాఖలో ఈ ‘అమెరికన్ కార్నర్’ ఏర్పాటు చేశారు. యూఎస్ విద్య, ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించి ఈ కార్నర్ సేవలు అందించనుంది. అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అమెరికన్ కార్నర్ ద్వారా పలు అంశాలపై సమగ్ర అవగాహన పొందే అవకాశం ఉంది.