ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరు నుంచి ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ నేత జగన్కి మినహాయింపు లభించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. 2014లో హుజూర్నగర్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ జగన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ ఉజ్జల్ భూయాల్ విచారణ చేపట్టారు. తదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేశారు.