వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పరువు నష్టం దావా వేశారు.తన పరువుకు భంగం వాటిల్లిందంటూ గోరంట్ల మాధవ్ కు విజయ్ తరపు లాయర్ వెంకటేష్ లీగల్ నోటీసులిచ్చారు. లీగల్ నోటీసుపై 7 రోజుల్లోగా సమాధానం చెప్పాలని లాయర్ పేర్కొన్నారు. తనకు, తన కుటుంబసభ్యుల గౌరవానికి భంగం కలిగే విధంగా గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారని చింతకాయల విజయ్ తెలిపారు. మాధవ్పై రూ.50 లక్షల పరువు విజయ్ నష్టం దావా వేశారు. ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ గోరంట్ల మాధవ్ కు సంబంధించి ఒక వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, అది మార్ఫింగ్ వీడియో అని, ఆ వీడియో బయటకు రావడం వెనుక చింతకాయల విజయ్ పాత్ర ఉందని నిన్న గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విజయ్ మాట్లాడుతూ… ఆయన నగ్న వీడియోతో తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఆ వీడియోను మార్ఫింగ్ చేయడం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు.