జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 44 మంది ఉపాధ్యాయులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల నుంచి నలుగురు ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్రం ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్లో విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్, చిత్తూరు జిల్లా ఎం.పైపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మునిరెడ్డికి అవార్డులు లభించాయి.