మంత్రి అనిల్ కుమార్
నెల్లూరు కార్పొరేషన్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 54వ డివిజన్ అభ్యర్థి షఫియా బేగంతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం మంత్రి అనిల్కుమార్ మీడియాతో మాట్లాడుతూ..నెల్లూరు కార్పొరేషన్లో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత తనదేనని స్పష్టంచేశారు. ఇస్లాంపేట, భగత్సింగ్ కాలనీల్లో ఒక్క ఇల్లు కూడా తొలగించమని స్పష్టం చేశారు.టీడీపీ, సీపీఎం నేతల దుష్ప్రచారాలను నమ్మొద్దని ఓటర్లకు తెలిపారు. టీడీపీ, సీపీఎం పార్టీలకు ఓటేసినా ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. వైసీపీని గెలిపిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.