పోలవరం పనుల పురోగతిపై సీఎం సమీక్ష
పోలవరం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా సీఎం వైఎస్ జగన్.. సోమవారం ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. 2022 జూన్ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలని, టన్నెల్, లైనింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎగువ కాఫర్ డ్యాం పనులను పూర్తిచేశామని అధికారులు వివరించారు. పోలవరం నిర్వాసితులతో సీఎం మాట్లాడారు. పోలవరం పనుల ఫోటో గ్యాలరీని వీక్షించారు.అనంతరం పోలవరం ఆర్అండ్ఆర్పై సమీక్ష నిర్వహించారు. ఆర్ అండ్ ఆర్ పనులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.