Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ప్రజా సమస్యలపై పోరాటం కోసమే యువగళం యాత్ర : నారా లోకేశ్‌

ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే యువగళం యాత్ర చేపడుతున్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. శుక్రవారం టీడీపీ ముఖ్యనేతలతో టీడీపీ నారా లోకేశ్‌ సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా పోరాడుతానని, సైకో ప్రభుత్వం స్పందించకుంటే టీడీపీ వచ్చాక తామే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతుందని, సమస్యలపై పోరాడుతున్న టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మాపై ఎన్ని కేసులు పెడుతున్నా టీడీపీ నేతలు పోరాటం ఆపడం లేదన్నారు. ఇకముందు పోరాటాలను మరింత ఉదృతం చేస్తామని, రాష్ట్రంలో సైకో పాలన పోవాలని.. సైకిల్‌ పాలన రావాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img