Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలి: తులసిరెడ్డి

వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షల్లో లీకేజీలు, మాస్‌ కాపీయింగులు సాధారణ అంశంగా మారాయని అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మూడు, నాలుగు, ఐదో తరగతులను ఎలిమెంటరీ విద్య నుంచి విడగొట్టి హైస్కూల్‌ విద్యలో కలపడం ఒక తుగ్లక్‌ చర్య అని అన్నారు. దీని వల్ల డ్రాపౌట్స్‌ పెరుగుతాయని చెప్పారు. విద్యార్థుల పట్ల సీఎం జగన్‌ కంస మేనమామలా, శకుని మేనమామలా తయారయ్యారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img